మిర్చి రైతుల సమస్యలపై సీఎం చంద్రబాబు సమీక్ష! క్వింటాల్ ఎంతంటే...!
Sat Feb 22, 2025 22:25 Politics.202502223229.jpg)
ఆంధ్రప్రదేశ్లోని మిర్చి రైతులకు కేంద్రం ఊరట నిచ్చే నిర్ణయం తీసుకుంది. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద మిర్చి పంటను సేకరించాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఈ విషయాన్ని ట్వీట్ చేశారు. ఎంఐఎస్ స్కీమ్ కింద మిర్చి పంటను సేకరించనున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లకు పెమ్మసాని చంద్రశేఖర్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ నిర్ణయం మిర్చి రైతులకు ఉపయోగపడుతుందని ట్వీట్ చేశారు.
ఏపీలోని మిర్చి రైతులకు కేంద్రం శుభవార్త వినిపించింది. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద మిర్చి పంట కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పెమ్మసాని చంద్రశేఖర్ ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా గుంటూరు మిరప రైతులకు పెద్ద ఉపశమనం! భారత ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద క్వింటాలుకు రూ. 11,781 మద్దతు ధరతో మిర్చి సేకరణకు ఆమోదం తెలిపిందిఅంటూ పెమ్మసాని చంద్రశేఖర్ ట్వీట్ చేశారు. మిర్చి ధరలు తగ్గుతున్న నేపథ్యంలో ధరల స్థిరీకరణకు ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని కేంద్ర మంత్రి ట్వీట్ చేశారు.
ఇది కూడా చదవండి: అరబ్ అడ్వొకేట్ తో చర్చించిన అనిల్ ఈరవత్రి! 17 మంది భారతీయులను ఉరిశిక్ష!
ఈ నిర్ణయం మేరకు తొలుత 25 శాతం ఉత్పత్తులను కొనుగోలు చేయనున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. ఆ తర్వాత అవసరమైన మేరకు మిర్చి సేకరణను పెంచనున్నట్లు వివరించారు. రైతుల సమస్యలను పరిష్కరించడంలో కృషి చేసినందుకు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ నిర్ణయం రైతులకు చాలా ఉపయోగపడుతుందని పెమ్మసాని చంద్రశేఖర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: దుబాయిలో ప్రవాసి కేంద్రాన్ని సందర్శించిన అనిల్ ఈరవత్రి! ఎందుకంటే!
మరోవైపు మిర్చి రైతుల సమస్యలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సచివాలయంలో శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. మిర్చి ధరల గురించి రైతులు, ఎగుమతిదారులతో చంద్రబాబు చర్చించారు. ఇతర దేశాలకు మిర్చి ఎగుమతులు పెరుగుతున్న నేపథ్యంలో.. మిర్చి పంటకు సరైన ధర దక్కడానికి ఉన్న మార్గాలను అన్వేషించాలని చంద్రబాబు ఆదేశించారు. అలాగే గుంటూరు మార్కెట్ యార్డ్లో ఉన్న మిర్చి నిల్వల గురించి కూడా చంద్రబాబు నాయుడు అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. మిర్చి ధరల తగ్గుదల నేపథ్యంలో గుంటూరు మార్కెట్ యార్డులో మిర్చి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేంద్రం మిర్చి పంటను కొనుగోలు చేయాలని చంద్రబాబు లేఖ కూడా రాశారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీ ప్రజలకు భారీ గుడ్న్యూస్.. ప్రతీ సంవత్సరం ప్రతీ వ్యక్తికీ రూ.25లక్షలు.. ఏప్రిల్లో ప్రారంభం!
ఏపీ ప్రజలకు భారీ గుడ్న్యూస్.. ప్రతీ సంవత్సరం ప్రతీ వ్యక్తికీ రూ.25లక్షలు.. ఏప్రిల్లో ప్రారంభం!
ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. యుద్ధం ముగియాలంటే అదొక్కటే మార్గం!
ప్రజలకు అప్డేట్.. ఆధార్ కార్డులో కొత్త మార్పు! ఇది తెలుసుకోకపోతే నీ పరిస్థితి ఇక అంతే!
ఆంధ్రప్రదేశ్ లో మరో కొత్త హైవేకు లైన్ క్లియర్! ఈ జిల్లాలకు మహర్దశ!
పోలీసులపై చండాలమైన కామెంట్స్ చేసిన జగన్! ఆ కేసు పెట్టి జైలుకు పంపండి.. ఏపీ మంత్రి డిమాండ్!
గుంటూరులో జగన్ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #Andhrapradesh #chandrababu #lokesh #mirchi #farmer #pawankalyan
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.